యాప్నగరం

కామపిశాచి.. అర్ధరాత్రి ఒంటరి మహిళ ఇంటి డోర్ కొట్టి..

ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంటి తలుపు కొడుతూ కబీర్ వేధింపులకు గురిచేసేవాడు. అర్ధరాత్రి వేళ కబీర్ తలుపు కొట్టడం విని అక్కడికి వచ్చిన హుస్సేన్‌తో వివాదం చెలరేగి కత్తిపోట్లకు దారితీసింది.

Samayam Telugu 11 Apr 2020, 8:30 pm
మహిళకు లైంగిక వేధింపుల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురైన దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నగరంలోని మరతహళ్లి ప్రాంతానికి చెందిన కబీర్ మహిళలను వేధిస్తుండేవాడు. అదే ప్రాంతంలో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళపై అతని కన్ను పడింది. అర్ధరాత్రి వేళ తరచూ ఆమె తలుపులు కొట్టి వేధింపులకు గురిచేసేవాడు.
Samayam Telugu knife


కబీర్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువైపోతుండడంతో విసిగిపోయిన అక్కడి మహిళలు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అస్సాంకి చెందిన హుస్సేన్ అహ్మద్(31)కి చెప్పుకున్నారు. రోజూ తలుపులు కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. అతని పీడ విరగడ చేయమని కోరారు. ఓ రోజు అర్ధరాత్రి కబీర్ ఆ ఒంటరి మహిళ ఇంటి తలుపులు కొట్టడం విన్న హుస్సేన్ అక్కడికి వచ్చాడు.

Also Read: అపార్ట్‌మెంట్‌లో చోరీకి వెళ్లిన దొంగ.. టెర్రస్‌పై మహిళ ఒంటరిగా కనపడడంతో..

ఎందుకు మహిళలను ఏడిపిస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన కబీర్ కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి హుస్సేన్ కడుపులో దారుణంగా పొడిచేశాడు. పొట్టలో పలుమార్లు పొడవడంతో హుస్సేన్‌కి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి హుస్సేన్‌ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మరతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: గొంతులు కోసే గాలిపటాలు.. లాక్‌డౌన్‌తో మళ్లీ తెరపైకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.