యాప్నగరం

నల్గొండ: వితంతువుతో సహజీవనం.. పోలీసుల ఎదుటే భర్తను చితక్కొట్టిన భార్య

తనను, పిల్లలను పట్టించుకోకుండా వితంతువుతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను పోలీసుల సమక్షంలోనే చితకబాదిందో ఇల్లాలు. ఈ ఘటన నల్గొండ పట్టణంలో జరిగింది.

Samayam Telugu 6 Sep 2020, 1:04 pm
అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను పట్టించుకోకుండా మరొక ఆడదానితో సహజీవనం చేస్తున్న వ్యక్తికి భార్య, బంధువులు తగిన బుద్ధి చెప్పారు. ప్రియురాలితో కలిసి ఉంటున్న ఇంటికి బంధువులు, పోలీసులతో కలిసి వెళ్లిన ఆమె అతడిని బయటకు లాగి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఆదివారం జరిగింది.
Samayam Telugu Image


Also Read: మెదక్: బావతో ప్రేమ వివాహం.. ఆరు మాసాలకే బలవన్మరణం

కనగల్‌ మండలం ధర్వేశిపురానికి చెందిన మాధవి అనే మహిళకు చిట్యాల మండలం ఎలికట్టకు చెందిన సాయిబాబాతో 2011లో వివాహం జరిగింది. కారు డ్రైవర్‌గా పనిచేసే సాయిబాబా.. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మూడు నెలలుగా భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేసిన సాయిబాబా ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు.

Also Read: శ్రీకాకుళం: భార్య ఎడబాటును తట్టుకోలేక మూడు రోజులకే భర్త ఆత్మహత్య

ఈ విషయం తెలుసుకున్న మాధవి నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం పోలీసులతో సహా వారింటికి వెళ్లి భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అందరూ చూస్తుండగానే మాధవి, ఆమె బంధువులు సాయిబాబాపై దాడికి పాల్పడి పోలీసులకు అప్పగించారు.

Also Read: కారుణ్య ఉద్యోగం ఘాతుకం.. సింగరేణి కార్మికుడిని కిరాతకంగా చంపేసిన భార్యాబిడ్డలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.