యాప్నగరం

విజయనగరంలో కాల్పుల కలకలం.. వ్యాపారి ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్

అడవిలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో పండ్ల వ్యాపారి కన్నప్ప కుడి వైపు ఛాతీలో నుంచి తుపాకీ గుండు దూసుకెళ్లింది.

Samayam Telugu 17 Jun 2020, 4:05 pm
విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. గుమ్మలక్ష్మీపురం జేడువాడ గిరిజన పరిసర అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు జరిగాయి. అడవిలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులు వినిపించడంతో స్థానికులు షాక్‌కి గురయ్యారు. ఈ కాల్పుల్లో దొరవలస గ్రామానికి చెందిన అరటి పండ్ల వ్యాపారి కన్నప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఛాతీలో నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
firing


తెల్లవారుజాము సమయంలో కొండల్లో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బుల్లెట్ గాయాలతో పడి ఉన్న వ్యాపారి కన్నప్పను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని వెంటనే పార్వతీపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం తీసుకెళ్లారు.

Also Read: హీరో సుశాంత్‌ మరణం: తట్టుకోలేక టీనేజ్ యువతి సూసైడ్

అయితే తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరనే విషయం తెలియరాలేదు. జంతువుల కోసం కాల్పులు జరిపితే గురితప్పి వ్యాపారికి తగిలి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో తెలియలేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also: ప్రియుడితో కలసి నవవధువు ఆత్మహత్య.! వికారాబాద్‌లో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.