కుటుంబంతో కలసి అత్తారింటికి వెళ్లిన అల్లుడు.. కొడుకుని వెంటబెట్టుకెళ్లి భవనం పైకెక్కి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. తన పదేళ్ల కొడుకుని వెంటబెట్టుకుని నాలుగంతస్తుల భవనం నుంచి దూకేయడంతో బాలుడు అక్కడికక్కడే మరణించగా తండ్రి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో వెలుగుచూసింది.
కొడుకుతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జైపూర్ పరిధిలోని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన రమేష్, అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అత్తారింటికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత మతిస్థిమితం లేని తన పదేళ్ల కొడుకు రౌనక్ గుప్తాను వెంటబెట్టుకుని నాలుగో అంతస్తుకి వెళ్లాడు. కొడుకుని చేతుల్లో పట్టుకుని అమాంతం బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో కొడుకు రౌనక్ అక్కడికక్కడే మరణించగా తండ్రి రమేష్కి తీవ్రగాయాలయ్యాయి.
Also Read: పెళ్లికూతురి పక్కింటి వ్యక్తిని నరికేసిన పెళ్లికొడుకు.. కారణం తెలిస్తే షాకే..
స్థానికులు వెంటనే స్పందించి రమేష్నిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రమేష్ జేబులో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తాను డిప్రెషన్తో బాధపుతున్నానని.. ఎవరినీ బాధపెట్టడం ఇష్టం లేక మతిస్థిమితం లేని కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాశాడని పోలీసులు చెబుతున్నారు.
డిప్రెషన్తో బాధపడుతున్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అతనిలో ఎలాంటి మార్పు రాలేదని.. అందుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారని.. షాక్ నుంచి తేరుకున్నాక విచారణ జరపనున్నట్లు పోలీసులు చెప్పారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also: ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్కి చిల్లే.! ఈఎంఐ మారటోరియం పేరుతో దోపిడీ
కొడుకుతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జైపూర్ పరిధిలోని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన రమేష్, అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అత్తారింటికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత మతిస్థిమితం లేని తన పదేళ్ల కొడుకు రౌనక్ గుప్తాను వెంటబెట్టుకుని నాలుగో అంతస్తుకి వెళ్లాడు. కొడుకుని చేతుల్లో పట్టుకుని అమాంతం బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో కొడుకు రౌనక్ అక్కడికక్కడే మరణించగా తండ్రి రమేష్కి తీవ్రగాయాలయ్యాయి.
Also Read: పెళ్లికూతురి పక్కింటి వ్యక్తిని నరికేసిన పెళ్లికొడుకు.. కారణం తెలిస్తే షాకే..
స్థానికులు వెంటనే స్పందించి రమేష్నిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రమేష్ జేబులో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తాను డిప్రెషన్తో బాధపుతున్నానని.. ఎవరినీ బాధపెట్టడం ఇష్టం లేక మతిస్థిమితం లేని కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాశాడని పోలీసులు చెబుతున్నారు.
డిప్రెషన్తో బాధపడుతున్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అతనిలో ఎలాంటి మార్పు రాలేదని.. అందుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారని.. షాక్ నుంచి తేరుకున్నాక విచారణ జరపనున్నట్లు పోలీసులు చెప్పారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also: ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్కి చిల్లే.! ఈఎంఐ మారటోరియం పేరుతో దోపిడీ