యాప్నగరం

కలుద్దాం రమ్మన్న ‘ఫేస్‌బుక్’ యువతి.. తీరా వెళ్లాక దిమ్మతిరిగే షాక్

అమ్మాయి పిలిచిందని ఎగిరి గంతేసిన యువకుడు ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. తీరా వెళ్లాక అతనికి ఊహించని షాక్ ఎదురైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి..

Samayam Telugu 8 Sep 2020, 10:13 pm
ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడిని ఏకాంతంగా కలుద్దాం రమ్మంటూ పిలిచిందో యువతి. అది నమ్మేసి ఎగిరిగంతేసిన యువకుడు ఆమె చెప్పిన చోటికి వెళ్లేసరికి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఓ గ్యాంగ్ అక్కడికి వచ్చి అతన్ని కిడ్నాప్ చేసి పట్టుకుపోయి చావబాదారు. చంపేస్తామంటూ బెదిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kidnap


కడలూరు జిల్లాకు చెందిన యువకుడి(31)కి ఫేస్‌బుక్‌లో ఓ యువతితో పరిచయమైంది. ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఆ పరిచయం ఫోన్లు చేసుకునే వరకూ వెళ్లింది. ఓ రోజు ఇద్దరం కలుద్దామంటూ తిరుచ్చి రావాలని ఫేస్‌బుక్ యువతి అడగడంతో ఓకే చెప్పేశాడు. తీరా తిరుచ్చి వెళ్లాక దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ఆమె చెప్పిన చోటుకి వెళ్లాక గుర్తు తెలియని దుండగులు యువకుడిని కిడ్నాప్ చేశారు.

Also Read: భర్తకి పుట్టిన కూతురు భారం.. ప్రియుడితో కలసి తల్లి ఘాతుకం

అతన్ని బట్టలిప్పేసి నగ్నంగా ఫొటోలు తీసి విచక్షణారహితంగా కొట్టారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఫేస్‌బుక్ ఫ్రెండ్ కాజమలై(21), వల్లువార్ నగర్‌కి చెందిన ఆశిక్ అలియాస్ నివాస్(21), పాలక్కరైకి చెందిన మొహమ్మద్ యాసీర్(22)ని అరెస్టు చేసి జైలుకి పంపించారు.

Read Also: గే సెక్స్‌కి యువకుడి బలి.. ఆ రొమాన్స్ కోసం వెళ్లి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.