యాప్నగరం

Hyd:బెయిల్‌పై బయటికొచ్చిన భర్త హత్య.. అమీర్‌పేటలో దారుణం

ధరంకరం రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతను ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి విడుదలైనట్లు సమాచారం.

Samayam Telugu 11 Oct 2020, 3:14 pm
హైద‌రాబాద్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని అమీర్‌పేట్‌కు చెందిన వ్యక్తిని దుండగులు కిరాతకంగా అంతమొందించారు. స్థానిక ధరంకరం రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌ను దుండగులు అతి దారుణంగా చంపేశారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. ఆ కేసులో జైలుకి వెళ్లిన చంద్రశేఖర్ ఇటీవల బెయిల్‌పై బయటికొచ్చినట్లు సమాచారం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అందుకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బయటి నుంచి వచ్చిన చంద్రశేఖర్ వాహనం పార్క్ చేసి వచ్చే సమయంలో నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: నెల్లూరులో జంట హత్యల కలకలం.. అనుమానంతో భర్త ఘాతుకం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.