యాప్నగరం

లారీ కిందకు నెట్టి యువకుడి హత్య.. గుంటూరులో దారుణం

భార్యాభర్తల గొడవలో ఎదురింటి వ్యక్తి జోక్యం చేసుకోవడంతో గొడవ పెద్దదైంది. మా గొడవ నీకెందుకనడంతో రెచ్చిపోయి తన బంధువులతో కలసి వారిపై దాడి చేశాడు.

Samayam Telugu 8 Oct 2020, 10:13 am
గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గొడవలో అడ్డువెళ్లినందుకు యువకుడిని లారీ కిందకు నెట్టి చంపేసిన అమానుష ఘటన జరిగింది. నకరికల్లు మండలం గుండ్లపల్లికి చెందిన ఏడుకొండలుకి అదే గ్రామానికి చెందిన ముజావర్ సైదాతో గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన సైదా, అతని అనుయాయులు ఏడుకొండలును కొట్టుకుంటూ మెయిన్ రోడ్డుపైకి తీసుకొచ్చారు. అది గమనించిన తిరుమల అంకమ్మ(35) గొడవను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అతనికి మద్దతుగా వస్తావా అంటూ సైదా, అతని అనుచరులు అంకమ్మపై దాడికి దిగారు. మెయిన్ రోడ్డుపై వేగంగా వస్తున్న లారీ కిందకు నెట్టేయడంతో అంకమ్మ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో వివాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఏడుకొండలు నిత్యం భార్యతో గొడవపడేవాడని.. ఎదురింట్లో ఉండే సైదా గొడవలో జోక్యం చేసుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ దుర్భాషలాడుకుంటుండగా అడ్డు వచ్చిన అంకమ్మని సైదా వర్గీయులు నెట్టేసినట్లు సమాచారం. తొమ్మిది మందిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై ఉదయ్‌బాబు తెలిపారు.

Also Read: రాఘవగా మారిన రెహమాన్.. నెల్లూరులో నమ్మకద్రోహం.. పట్టించిన కారు డ్రైవర్ ఫొటో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.