యాప్నగరం

మటన్ వ్యాపారి భార్యతో ఆ సంబంధం.! ప్రియుడి మెడ నరికి.. కరీంనగర్‌లో దారుణం

తోటి వ్యాపారి భార్యతో వివాహేతర సంబంధం ప్రాణాలు తీసింది. గతంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అయినా ఆ సంబంధం కొనసాగించడంతో హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 22 Nov 2020, 5:08 pm
కరీంనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మటన్ వ్యాపారి ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మెడ నరికి అమానుషంగా హతమార్చాడు. నగరంలోని హుస్సేన్ పురకి చెందిన మటన్ వ్యాపారి ఎండీ వలీపాషాని మరో మటన్ వ్యాపారి సయ్యద్ అఫ్జల్ తల్వార్‌తో కిరాతకంగా నరికి చంపాడు. నగర శివారులోని బొమ్మకల్ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది.
Samayam Telugu హత్యకు గురైన వలీంపాషా
karimnagar murder


బైక్‌పై వస్తున్న వలీంపాషాని అడ్డగించి దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. మటన్ వ్యాపారం చేసే వలీంపాషా తోటి వ్యాపారి అయిన అఫ్జల్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విషయమై ఇద్దరి మధ్య గతంలో గొడవలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెబుతున్నా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అరెస్టును ధ్రువీకరించలేదు. హత్య సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ రేష్మా పెరుమాళ్, ఏసీపీ విజయసారథి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read:
మహిళను కాపాడబోతూ యువకుడి సెల్ఫీ, నీటమునిగి మృతి.. ఆమె ప్రియుడి ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.