యాప్నగరం

తల్లిపై దాడి చేశాడని.. అన్నను కత్తెరతో పొడిచి చంపిన తమ్ముడు

రూ.300 అడిగితే ఇవ్వలేదని తల్లిపై దాడి చేశాడు అన్సర్ బాషా. ఈ ఘటనను చూసిన అతడి తమ్ముడు షాదిక్ అన్నను కత్తెరతో పొడిచి చంపేశాడు.

Samayam Telugu 27 May 2020, 9:41 am
అన్నదమ్ముల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణం తీసిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మంగళవారం జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన హమీద్‌, రహమత్‌ దంపతులు తమ కొడుకులు అన్సర్‌బాషా(26), షాదిక్‌తో కలిసి బతుకుదెరువు కోసం ఆరు మాసాల క్రితం చంద్రగిరిలోని ముకుంద వీధికి వలస వచ్చారు. పాతపేట బజారువీధిలో బిర్యానీ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వారి బిర్యానీ సెంటర్‌ మూతపడింది. మద్యానికి బానిసైన పెద్ద కుమారుడు అన్సర్‌ బాషా మంగళవారం తల్లితో పాటు పాతపేటలోని ఓ మెడికల్‌ షాపునకు చేరుకున్నాడు. రూ.300 ఇవ్వాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది.
Samayam Telugu తమ్ముడి చేతిలో హత్యకు గురైన అన్సర్‌బాషా


Also Read: కాళ్లు చేతులు విరగ్గొట్టి, బండరాయితో మోది.. మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణహత్య

దీంతో కోపంతో ఊగిసలాడిన అన్సర్‌బాషా తల్లిపై దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న చిన్న కుమారుడు షాదిక్‌ తల్లికి అడ్డుగా నిలిచి అన్నతో ఘర్షణకు దిగాడు. తల్లిని ఏదైనా చేస్తాడన్న ఆందోళనతో తమ్ముడు షాదిక్‌ మెడికల్‌ షాపులోని కత్తెరతో అన్న గొంతు, పొట్ట, కిడ్నీ భాగంలో పొడిచాడు. స్థానికులు అన్సర్‌బాషాను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. చంద్రగిరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి షాదిక్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: నడిరోడ్డుపైనే వివాహితపై అఘాయిత్యం.. ఆదిలాబాద్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.