యాప్నగరం

భర్త వద్దు.. కానీ ఆయన ఆస్తి కావాలట! ప్రియుడితో కలసి భార్య ఘాతుకం

మద్యానికి బానిసగా మారిన భర్తని అంతం చేస్తే ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చిన కసాయి భార్య కుట్ర పన్నింది. మద్యం తాగి నిద్రిస్తున్న భర్తని ప్రియుడి సాయంతో చంపేసింది.

Samayam Telugu 3 Oct 2020, 4:15 pm
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి భర్తని దారుణంగా చంపేసిందో కసాయి భార్య. తండ్రి చనిపోతే తనకు ఆస్తి దక్కుతుందని హత్యకు కొడుకు సహకరించాడు. ఈ అత్యంత అమానుష ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. గుడుపల్లె మండలం గుండ్లసాగరానికి చెందిన జ్యోతికి కర్ణాటక సరిహద్దు గ్రామమైన ఎర్రవంకలుకి చెందిన శంకర్‌(40)తో వివాహమైంది. వారికి కొడుకు అరుణ్ ఉన్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


భార్య జ్యోతి అదే గ్రామానికి చెందిన శివకుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో రహస్యంగా రాసలీలలు సాగించేది. మద్యానికి బానిసైన శంకర్ అదే విషయమై తరచూ భార్యతో గొడవపడేవాడు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన జ్యోతి భర్తని చంపేయాలని నిర్ణయించుకుంది. అతని ఆస్తితో ప్రియుడితో హాయిగా బతకొచ్చని భావించింది. ప్రియుడు శివకుమార్‌తో కలసి హత్యకు కుట్ర చేసింది. ఆస్తి ఎరచూపి కొడుకుని కూడా ఒప్పించింది.

Also Read: Mystery: హైదరాబాద్ వెళ్తున్నానని.. బొబ్బిలిలో శవమైన విజయవాడ యువకుడు

గత నెల 23న భార్య ప్రియుడు శివకుమార్‌తో కలసి మద్యం తాగిన శంకర్ ఇంట్లో నిద్రకు ఉపక్రమించాడు. నిద్రిస్తున్న శంకర్‌ మెడకు తాడు బిగించి దారుణంగా చంపేశారు. ఆస్తి దక్కుతుందన్న ఆశతో కొడుకు కూడా తల్లికి సహకరించాడు. అనంతరం శవాన్ని శాంతిపురం మండలం ఎంకేపురం సమీపంలోని ఓ కుంటలో పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

Read Also: పెళ్లికాని బావమరిది.. ఆస్తి కోసం చంపేసిన అక్కాబావలు.. ప్రకాశంలో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.