యాప్నగరం

సొంత తమ్ముడ్ని చంపేసిన అన్న.. ఆస్తి కోసమే దారుణం

భార్యలేని సమయం చూసి తమ్ముడి ఇంటికి వెళ్లాడు. తనకు కొంత డబ్బుతో పాటు.. ప్లాట్‌లో వాటా కావాలంలూ పట్టుబడ్టాడు. దానికి తమ్ముడు కాదనేసరికి కత్తితో పొడిచి పరారయ్యాడు.

Samayam Telugu 25 Jul 2020, 1:34 pm
డబ్బు ఆశ అనేది మనిషితో ఎలాంటి తప్పు అయిన చేయిస్తోంది. ఆస్తి కోసం సొంత తమ్ముడ్ని చంపుకున్నాడు ఓ అన్న. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్ జిల్లా పైథాన నగరానికిచెందిన వేద్ ప్రకాశ్ రామ్ నాథ్ ఠాకూర్, సూర్యప్రకాశ్ అన్నదమ్ములు. ఇద్దరి వయసు 50 ఏళ్లు పైనే. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రోజున తమ్ముడు సూర్య ప్రకాశ్ ఇంటికి వచ్చాడు అన్న వేద్ ప్రకాశ్.
Samayam Telugu తమ్ముడ్ని చంపిన అన్న
man killed borther

Read More: ఏలూరు: కోవిడ్ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీల పరార్
ఒక ప్లాట్‌లో వాటా, ఇల్లు కొనడానికి రూ .2లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు. తన వద్ద డబ్బు లేదు, వాటా కూడా ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదని సూర్యప్రకాశ్‌ తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ.. తమ్ముడి భార్య బయటకెళ్లడం చూసి సూర్యప్రకాశ్‌ను కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు భార్యకు సమాచారం అందించారు. అతడ్ని ఆస్పత్రికి తరలించేలోగా సూర్యప్రకాశ్‌ మరణించాడు. సీసీఫుటేజీ ఆధారంగా వేద్‌ప్రకాష్ ఠాకూర్‌ను జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆస్తి కోసం అన్న సొంత తమ్ముడ్నే హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.