యాప్నగరం

మంటలార్పేందుకు వెళ్లి ఫైర్ ఆఫీసర్ సజీవదహనం.. అనంతపురంలో విషాదం

విధి నిర్వహణలో ఓ ఫైర్ ఆఫీసర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. మంటలు ఆర్పేందుకు వెళ్లి అగ్నికీలలకు చిక్కి సజీవదహనమైన విషాద ఘటన ఏపీలో జరిగింది.

Samayam Telugu 26 Apr 2020, 6:29 pm
మంటలార్పేందుకు వెళ్లిన అగ్నిమాపక దళ అధికారి అగ్నికి ఆహుతైన విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. మంటలు ఆర్పేందుకు వెళ్లి అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన పెనుగొండ మండలంలో జరిగింది. మండలంలోని రాంపురం సమీపంలోని గుజిరి గోడౌన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అగ్నికీలకు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. తక్షణం స్పందించిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రయత్నంలో ఫైర్ ఆఫీసర్ పరంధామ ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకున్నాడు. అగ్నికీలల నుంచి బయటపడలేక సజీవ దహనమయ్యాడు.

Also Read: వామ్మో!! భారీ దోపిడీ.. రూ.8 కోట్ల బంగారం, వజ్రాలు చోరీ

మంటలు భారీస్ధాయిలో ఎగసిపడుతుండడంతో అదుపుచేయడం సాధ్యం కావడం లేదు. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. మంటలు ఆర్పేందుకు వచ్చి సిబ్బంది అగ్నికి ఆహుతి కావడం స్థానికులను కలచివేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:
యువతి శవాన్ని కుక్కలు పీక్కుతిని.. దొరకని ఆనవాళ్లు.. తాడేపల్లిగూడెంలో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.