యాప్నగరం

ఆటోను ఢీకొట్టిన ఉల్లిపాయల లారీ.. గుంటూరులో విషాదం

ఉల్లి లోడు లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో ట్రక్కు ఆటో పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Samayam Telugu 8 May 2020, 3:13 pm
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజాము సమయంలో మంగళగిరి మండల పరిధిలోని కాజా టోల్‌ప్లాజ్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటోను ఉల్లిపాయల లోడు లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.
Samayam Telugu ప్రమాదానికి గురైన లారీ, ఆటో


లారీ ఢీకొన్న ధాటికి ఆటో పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు గాయాల పాలయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రష్యన్ భామతో అడ్డంగా దొరికిపోయిన ఇండియన్ బాయ్‌ఫ్రెండ్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.