యాప్నగరం

ప్రాణం తీసిన పంక్చర్.. గుంటూరులో విషాద ఘటన

లారీ టైర్ పంక్చర్ ఆ డ్రైవర్ ప్రాణం తీసింది. లారీ పక్కన నిలిపి టైర్ మార్చుకున్న డ్రైవర్లు ఆఖరి నిమిషంలో ప్రమాదానికి గురయ్యారు.

Samayam Telugu 2 Oct 2020, 3:00 pm
గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీ టైర్ పంక్చర్ డ్రైవర్ ప్రాణం పోయేందుకు కారణమైంది. పంక్చర్ టైర్ ఎక్కిస్తున్న లారీ డ్రైవర్లను ఆటో ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన పెదకాకాని మండలం కంతేరు అడ్డరోడ్డు వద్ద జరిగింది. చెన్నై నుంచి యూరియా లోడుతో పశ్చిమ బెంగాల్ వెళ్తున్న లారీ పంక్చరై నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ఆగిపోయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు కిందకు దిగి పంక్చర్ అయిన టైరుని మార్చారు. అనంతరం పంక్చర్ అయిన టైర్‌ని లారీ వెనుక అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన డ్రైవర్ వేలు నడిముత్తు(32) మృత్యువాతపడ్డాడు. మరో డ్రైవర్ రామ్‌రాజ్ సోలయరాజ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటో డ్రైవర్‌కి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Ongole: బావమరిదిని చంపేసి ఆస్తి కొట్టేద్దామనుకున్న బావలు.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.