యాప్నగరం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఒకరి మృతి

ఆటో కారు ఢీకొని యువకుడు మరణించాడు. మెదక్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న కారు చౌరస్తా వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఒకరు మరణించారు.

Samayam Telugu 14 May 2020, 5:06 pm
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద జరిగింది. పోతంశెట్టిపల్లి చౌరస్తా నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆటోని మెదక్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ ప్రమాదంలో సంతోష్ కుమార్(28) అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కిన తల్లి.. మంచానికి కట్టేసి దారుణంRead Also: పోర్న్ వీడియోలు చూస్తూ చెల్లెలిపై అన్న పైశాచికం.. అనంతపురంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.