యాప్నగరం

భార్య దారుణ హత్య.. పక్కింటి వ్యక్తిని నరికేసిన భర్త

భార్య దారుణ హత్యకు గురైందన్న విషయం పొలంలో పనిచేసుకుంటున్న భర్త లక్ష్మణ్‌కి తెలిసింది. ఆవేశంగా బయల్దేరిన లక్ష్మణ్.. తన పక్కింటి వ్యక్తిని నడిరోడ్డుపై నరికేశాడు.

Samayam Telugu 31 Jul 2020, 10:31 pm
చిన్నగొడవ రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఆవేశానికి గురైన ఓ వ్యక్తి పక్కింటి మహిళను కొట్టి చంపేశాడు. అది తెలుసుకున్న ఆమె భర్త.. నిందితుడిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికేశాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో చోటుచేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్మా గ్రామానికి చెందిన లక్ష్మణ్ సదా(30), పవన్ సదా(26) పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


ఏదో చిన్న విషయమై పవన్‌కి లక్షణ్ భార్య దేవి నడుమ వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో బలమైన వస్తువు తీసుకుని దేవిని కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పక్కింటి వ్యక్తి తన భార్యని చంపేశాడని తెలుసుకున్న లక్ష్మణ్ పొలం నుంచి ఆవేశంగా బయల్దేరాడు. పవన్‌ని నడిరోడ్డుపై నరికేశాడు. అందరూ చూస్తుండగానే కిరాతకంగా హత్య చేశాడు. హత్యానంతరం పారిపోకుండా పోలీసులు వచ్చే వరకూ వేచి చూసి లొంగిపోయాడు. తన భార్యని చంపేశాడన్న కోపంతో పవన్‌ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: యాక్సిడెంట్‌లో అన్న మరణం.! మరిది అనుమానంతో వదిన బాగోతం వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.