యాప్నగరం

చెవిలో ఇయర్ ఫోన్స్‌ చంపేశాయ్.. వరంగల్‌లో యువకుడి దుర్మరణం

చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడమే ప్రమాదానికి దారితీసింది. మ్యూజిక్ వింటూ రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 22 Nov 2020, 10:16 am
చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడపడం.. రోడ్డుపై తిరగడం నేటి యువతకు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇయర్ ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజిక్ వింటూ ప్రమాదాలను కూడా పట్టించుకోవడం లేదు. వెనక నుంచి వచ్చే వాహనాల హారన్లు వినపడక.. రైలు పట్టాలపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా మరోటి చోటుచేసుకుంది. ఇయర్ ‌ఫోన్స్‌ పెట్టుకుని రైలు పట్టాలు దాటుతున్న యువకుడు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వరంగల్‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
earphones


వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని చింతల్ చంద్రవదన కాలనీకి చెందిన అల్లూరి సునీల్(28) పెయింటింగ్ పనులకు వెళ్లేవాడు. పని ముగించుకుని ఇంటికి వస్తూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చింతల్ వద్ద రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. అదే సమయంలో వచ్చిన ఏడీఆర్‌ఎం స్పెషల్‌ రైలు సునీల్‌ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేమాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Also Read: కులానికి బలైన మరో ప్రేమజంట.. చిత్తూరు సరిహద్దులో తీవ్ర విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.