యాప్నగరం

భార్యపై కోపం.. ఐదు నెలల బిడ్డని చంపేసిన కసాయి భర్త

ఐదు నెలల చిన్నారిని అమానుషంగా చంపేశాడో దుర్మార్గపు తండ్రి. భార్యతో గొడవపడి ఆవేశంలో అభం శుభం తెలియని కూతురిని కిరాతకంగా అంతమొందించాడు.

Samayam Telugu 10 May 2020, 3:49 pm
భార్యతో గొడవపడి బిడ్డని చంపేశాడో దుర్గార్గుడు. ముక్కుపచ్చలారని ఐదు నెలల పసికందుని అమానుషంగా హత్య చేశాడు. రాత్రి తనతో నిద్రపోయిన బిడ్డ తెల్లారేసరికి శవమై కనిపించకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అచేతనంగా పడి ఉన్న కూతురిని తీసుకుని పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణెలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


భార్యపై కోపంతో ఐదు నెలల పసికందుని కన్నతండ్రి గొంతుపిసికి చంపేసిన దారుణ ఘటన నగరంలోని బావ్‌ధాన్ ఏరియాలో చోటుచేసుకుంది. క్షత్రియనగర్‌కి చెందిన బాపురావ్ జాదవ్‌ నిత్యం భార్యతో గొడవలు పడుతుండేవాడు. ఓ రోజు ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో భార్యపై కోపంతో కన్నకూతురిని దారుణంగా చంపేశాడు. అభంశుభం తెలియని చిన్నారిని గొంతుపిసికి హత్య చేశాడు.

Also Read:
భార్య నగ్నచిత్రాలు ఫ్రెండ్స్‌కి.. వారితో సెక్స్ చేయాలని వేధింపులు.. చివరికి..

రాత్రి తనతో పడుకున్న కూతురు కనిపించకపోయే సరికి భార్య ఇల్లంతా వెతికింది. కూతురు గురించి భర్తని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఇంటి బయట అచేతనంగా పడి ఉన్న చిన్నారిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Read Also: అవి బాగా పెరిగాయ్.. అమ్మాయిలకు కీచక టీచర్ వేధింపులు.. బ్రా సైజ్, కలర్‌పై నీచ వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.