యాప్నగరం

అనంతపురంలో అమానుషం.. భార్యని తిట్టాడని అన్నని చంపేసిన తమ్ముడు

భార్యని తిట్టాడని మనసులో పెట్టుకున్న తమ్ముడు అదనుచూసి ఘాతుకానికి తెగబడ్డాడు. అన్నని కిరాతకంగా హత్య చేశాడు.

Samayam Telugu 25 Sep 2020, 9:45 am
అనంతపురంలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్యని తిట్టాడన్న కోపంతో అన్నని కిరాతకంగా చంపేశాడో కసాయి తమ్ముడు. జిల్లాలోని ఉరవకొండ పాతపేటకి చెందిన రామాంజనేయులు, మల్లేష్ అన్నదమ్ములు. మల్లేశ్వర టాకీస్ సమీపంలో నివాసముంటున్నారు. కొద్దికాలంగా ఇద్దరి మధ్య ఓ స్థలం విషయమై వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అదే విషయమై తమ్ముడు మల్లేష్ భార్యతో గొడవ జరగడంతో రామాంజనేయులు ఆమెను తీవ్రంగా దూషించాడు. అసభ్యకర పదజాలంతో తిట్టాడు.
Samayam Telugu అన్న శవం పక్కనే తమ్ముడు, పరిశీలిస్తున్న పోలీసులు
murder


అది మనసులో పెట్టుకున్న తమ్ముడు అన్నని కిరాతకంగా హత్య చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై మోది దారుణంగా చంపేశాడు. అనంతరం శవం పక్కనే కూర్చుని అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. స్పాట్‌లోనే కూర్చుని ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read: Telangana: భర్తని ప్లాన్ చేసి చంపేసిన భార్య.. పట్టించిన తోడికోడలి ఫోన్ కాల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.