యాప్నగరం

మద్యం మత్తులో వేధింపులు.. తమ్ముడిని ఉరేసి చంపేసిన అన్న

మద్యానికి బానిసైన తమ్ముడు తన కుటుంబాన్ని తరుచూ వేధించడాన్ని తట్టుకోలేకపోయిన అన్న అతడిని ఉరేసి చంపేశాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Samayam Telugu 27 May 2020, 11:30 am
మద్యం మత్తులో తరచూ గొడవ పడుతున్న తమ్ముడి ప్రవర్తనతో విసిగిపోయిన తమ్ముడిని ఓ వ్యక్తి ఉరేసి చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చెన్నారెడ్డినగర్‌లో ఉండే మునావర్‌ (33) పదేళ్ల కింద ఉప్పల్‌కు చెందిన కల్పన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిసైన మునావర్ తరుచూ వేధిస్తుండటంతో విసిగిపోయిన కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది.
Samayam Telugu Image


Also Read: గుండు గీయించుకోవాలంటూ భార్యకు చిత్రహింసలు.. న్యాయవాదిపై కేసు

అయితే తన భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకురావాలని మునావర్ తన అన్న షాహిద్(45)తో గొడవపడేవాడు. వారం రోజుల క్రితం అన్న కూతురి(12)తో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కుటుంబాన్ని విసిగిస్తున్న తమ్ముడు మునావర్‌ను చంపేయాలని షాహిద్ పథకం వేశాడు. మంగళవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న తమ్ముడి గదిలోకి వెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి తాడుతో మెడకు ఉరేసి చంపేశాడు. ఈ విషయాన్ని రెండో తమ్ముడు ఖలీద్‌కు చెప్పగా... అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు షాహిద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌ టు కర్నూలు.. చేపల పెట్టెల్లో లిక్కర్ స్మగ్లింగ్, ఇద్దరి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.