ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకుని బావమరిది కొట్టాడన్న కోపంతో బావలు ఘాతుకానికి తెగబడ్డారు. ఇనుప పైపుతో విచక్షణా రహితంగా కొట్టడంతో మృతి చెందాడు. ఈ అమానుష ఘటన సంతనూతలపాడు మండలంలో జరిగింది. గుమ్మనంపాడు గ్రామానికి చెందిన తాడి చిరంజీవి(30) అక్క కొడుకుని కర్రతో కొట్టాడు. ఆ విషయం తెలుసుకున్న బావ వెలుగు శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
సోదరుడు కోటితో కలసి బావమరిది చిరంజీవిపై దాడికి దిగాడు. ఇనుప పైపుతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చిరంజీవిని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
సోదరుడు కోటితో కలసి బావమరిది చిరంజీవిపై దాడికి దిగాడు. ఇనుప పైపుతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చిరంజీవిని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: