యాప్నగరం

బాబాయ్‌ని కొట్టి చంపేసిన అబ్బాయ్.. విజయవాడలో దారుణం

పదేళ్ల కిందట అన్నకిచ్చిన 70 సెంట్ల భూమిని తమ్ముడు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అది అన్న కొడుక్కి నచ్చలేదు. బాబాయి పొలం గట్టుపై ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడి చేసి..

Samayam Telugu 17 Jul 2020, 2:57 pm
ఆస్తి వివాదాల నేపథ్యంలో బాబాయ్‌ని అబ్బాయి కొట్టి చంపేసిన దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గన్నవరం పరిధిలోని పురుషోత్తంపట్నం గ్రామానికి చెందిన సత్యవర్ధన్‌రావు, మోహన్ రావు(57) అన్నదమ్ములు. మోహన్ రావుకి సుమారు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. పదేళ్ల కిందట అన్న సత్యవర్ధన్‌ రావుకి వ్యవసాయం చేసుకునేందుకు 70 సెంట్ల భూమి ఇచ్చాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


ఇటీవల తండ్రి ద్వారా వచ్చిన వారసత్వ ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో తన 70 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్నాడు. పొలంలో వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యాడు. తన కొడుకు ప్రదీప్‌తో కలసి వరినాట్లు వేయించేందుకు పొలానికి వెళ్లాడు. భూమిని తిరిగి తీసుకున్న బాబాయిపై సత్యవర్ధన్‌రావు కొడుకు శరత్ కోపంతో రగిలిపోయాడు. బాబాయి అంతుచూడాలిన బయల్దేరాడు.

Also Read: తల్లీకూతుళ్లని ట్రాక్టర్‌తో తొక్కించి.. రేప్ కేసు నిందితుడి కిరాతకం

పొలంలో పనులు జరుగుతుండగా బైక్‌పై కూర్చుని ఉన్న మోహన్ రావు తలపై కర్రతో దాడి చేశాడు. మోహన్ రావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పొలంలో నాట్లు వేస్తున్న కొడుకు ప్రదీప్.. ఇతర కూలీలు గట్టుకి చేరుకునేలోపు అక్కడి నుంచి పరారయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: అడుక్కుని కోట్లకు పడగలెత్తిన అత్త.. అద్దె కోడలికి కన్నుకుట్టి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.