యాప్నగరం

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియుడి కిరాతకం.. పాతబస్తీలో దారుణం

పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. అన్నతో కలసి అమానుషంగా ఆమెను హత్య చేశాడు. హైదరాబాద్ పాతబస్తీలో ఈ దారుణం జరిగింది.

Samayam Telugu 20 Oct 2020, 12:27 pm
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కిరాతకంగా చంపిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్‌కి చెందిన ముస్తఫా, నారాయణ్‌ఖేడ్‌కి చెందిన యువతి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రియురాలిని దూరం పెట్టడంతో ఆమె నేరుగా ప్రియుడి ఇంటికెళ్లింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతి నిలదీయడంతో ప్రియుడు ముస్తఫా, అతని అన్న జమీల్ ఇంట్లోకి తీసుకెళ్లి దారుణంగా చంపేశారు. ఆమెను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను రెయిన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నారాయణ్‌ఖేడ్‌కి తరలించారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పెళ్లైన ఆర్నెల్లకే నూరేళ్లు.. బిల్డింగ్ పైనుంచి దూకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.