యాప్నగరం

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి దారుణ హత్య

ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. యువతి గొంతుకోసి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో ఈ దారుణం జరిగింది.

Samayam Telugu 15 Oct 2020, 2:06 pm
ప్రేమోన్మాది నర్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన మరువక ముందే విజయవాడలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఇంజనీరింగ్ విద్యార్థినిని ప్రేమోన్మాది గొంతుకోసి కిరాకతంగా చంపేశాడు. నగరంలోని క్రీస్తురాజపురంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్వినిని అదే ఏరియాకి చెందిన స్వామి గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. నేరుగా యువతి ఇంటికెళ్లిన స్వామి కత్తితో ఆమె గొంతులో పొడిచినట్లు తెలుస్తోంది. తీవ్రరక్తస్రావమైన యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
Samayam Telugu ప్రాణాలు కోల్పోయిన దివ్య తేజస్విని, ఉన్మాది స్వామి
murder


అనంతరం ఉన్మాది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కత్తితో తనని తాను పొడుచుకుని బలవన్మరణానికి పాల్పడడంతో తీవ్రగాయాలయ్యాయి. అతన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అతన్ని వేరే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

Also Read: తిరుపతిలో పాస్టర్ అకృత్యం.. యువతిని కొట్టి, బెదిరించి అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.