యాప్నగరం

వైజాగ్: అమ్మమ్మ హత్య.. బంగారం కోసం మనవడి ఘాతుకం

సొంత అమ్మమ్మని కిరాతకంగా చంపేశాడో కసాయి మనవడు. ఆమె మెడలోని బంగారం దోచుకుని దారుణంగా హత్య చేశాడు. మారుమూల పొదల్లో పడేసి పారిపోయినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 3 Sep 2020, 7:43 pm
బంగారం కోసం సొంత అమ్మమ్మనే కడతేర్చాడో దుర్మార్గుడు. కిరాతకంగా చంపేసి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. భీమిలి మండలం దాకమర్రికి చెందిన కొంకి పాపాయమ్మ(65)ను కూతురి కొడుకు కంటుభుక్త శ్రీనివాస్ దారుణంగా హత్య చేశాడు. ఆమెను చంపేసి పద్మనాభం మండలం బర్లపేట మారుమూల పొదల్లో పడేసి పరారయ్యాడు. వృద్ధురాలి మెడలోని ఆరుతులాల బంగారం దోచుకుని పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలిని పాపాయమ్మగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


Also Read: బాలామణి బాగోతం బట్టబయలు.. వీడిన అమలాపురం మర్డర్ మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.