యాప్నగరం

పరువు హత్య.. ప్రేమలో పడిందని కూతురిని కొట్టి చంపేసిన తండ్రి.

ప్రేమలో పడి తన పరువు తీస్తోందన్న కక్షతో ఓ తండ్రి కన్న కూతురినే దారుణంగా చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో జరిగింది.

Samayam Telugu 7 Aug 2020, 10:04 am
తన కూతురు ప్రేమలో పడి కుటుంబ పరువు తీస్తోందన్న ఆక్రోశంతో దారుణానికి పాల్పడ్డాడో తండ్రి. కన్నబిడ్డ అన్న కనికరం కూడా లేకుండా క్రికెట్‌ బ్యాట్‌తో తలపై కొట్టి చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగరంలో జరిగింది.
Samayam Telugu Image


Also Read: హైదరాబాద్: చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన ఇద్దరి అరెస్ట్

రాజ్‌కోట్ నగరంలోని గాంధీ గ్రామ్ ప్రాంతానికి చెందిన గోపాల్ నకూం అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడి భార్య చనిపోవడంతో కూతురితో కలిసి ఉంటున్నాడు. ఇటీవల అతడి కూతురు స్థానికంగా ఓ యువకుడితో ప్రేమలో పడింది. తరుచూ అతడితో బయటికి వెళ్తుండటంతో ఈ విషయం తండ్రికి తెలిసింది.

Also Read: నడిరోడ్డుపై వివాహితకు వేధింపులు.. అడ్డుకున్న భర్త, పోలీసులపై యువకుల దాడి

ఈ విషయంపై కూతురితో ఎన్నోసార్లు గొడవపడ్డాడు. ప్రేమలో పడి పరువు తీస్తోందని కోప్పడేవాడు. బుధవారం కూడా ఇదే విషయంపై అతడు కూతురితో గొడవపడ్డాడు. ఆమె ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆవేశానికి గురై క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోపాల్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read: బాపట్ల: మతాంతర వివాహం చేస్తుకున్న కూతురు.. తండ్రి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.