యాప్నగరం

భార్యను చంపేసి సంచిలో మూటకట్టి.. కూకట్‌పల్లిలో భర్త ఘాతుకం

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలోని ఎస్ఎస్ కాలనీలో శేఖర్ అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా చంపేశాడు. శవాన్ని గోనెసంచిలో మూటకట్టి

Samayam Telugu 6 Jan 2021, 12:53 pm
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను తలపై కొట్టి, చున్నీతో ఉరేసి చంపేసిన శేఖర్ అనే వ్యక్తి ఆమెను మూటకట్టి పడేశాడు. ఎస్ఎస్ కాలనీలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శేఖర్, స్రవంతి దంపతులు కేపీహెచ్‌బీ పరిధిలోని ఎస్ఎస్ కాలనీలో కొన్నాళ్లుగా నివాసముంటున్నారు. రెండ్రోజుల క్రితం గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన శేఖర్‌ భార్యను ఆవేశంలో కొట్టి చున్నీతో ఉరేసి చంపేశాడు.
Samayam Telugu Image


Also Read: ధర్మవరంలో పసికందు కిడ్నాప్... తల్లి ఒడిలో నుంచి లాక్కెళ్లిన దుండగులు

శవాన్ని గోనెసంచిలో మూటకట్టి భవనం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేశాడు. మంగళవారం సంచి నుంచి దుర్వాసన రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంచి తెరిచి చూడగా స్రవంతి మృతదేహం కనిపించింది. శేఖర్ కనిపించకపోవడంతో అతడే భార్యను హత్యచేసి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘మంచి కూతుర్ని కాలేకపోయా.. సారీ అమ్మానాన్న’.. కన్నీరు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.