యాప్నగరం

చేపల కూర వండలేదని... 9 నెలల గర్భిణిని కొట్టి చంపిన భర్త

మద్యానికి బానిసైన మోతీలాల్ మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికొచ్చాడు. చేపల కూర వండలేదని కర్రతో కిరాతకంగా కొట్టి చంపేశాడు.

Samayam Telugu 6 Aug 2020, 9:59 am
మద్యం మత్తులో రాక్షసుడిగా మారిన ఓ వ్యక్తి నిండు గర్భిణి అయిన భార్యను కిరాతకంగా చంపేసిన ఘటన ఒడిశాలోని బొలంగీర్‌ పట్టణం రాధరాణిపడ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. మోతీలాల్‌ బారిక్‌ అనే వ్యక్తికి అనాదిని(25) అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల మోతీలాల్ మద్యానికి బానిసై భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. తొమ్మిదో నెల రావడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తోంది.
Samayam Telugu Image


Also Read: ప.గో. జిల్లా: వివాహితతో సహజీవనం.. అనుమానంతో గొంతు నులిమి చంపేసి

మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మోతీలాల్ చేపల కూర వండలేదని భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంతో భార్య తలపై కర్రతో కొట్టి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన అనాదిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మోతీలాల్‌పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు.

Also Read: అమ్మాయిల పిచ్చే ప్రాణం తీసింది.. నెల్లూరు డాక్టర్‌ మృతిపై వీడిన మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.