యాప్నగరం

మద్యం మత్తులో మరిది ఘాతుకం.. గుంటూరులో దారుణం

మద్యం మత్తులో ఉన్న మరిదికి వదినతో గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహం చెందిన మరిది ఇనుప రాడ్డుతో కొట్టాడు.

Samayam Telugu 17 Dec 2020, 2:19 pm
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో మరిది ఘాతుకానికి తెగబడ్డాడు. వదినను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇనుపరాడ్డుతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ అమానుష ఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఎస్తేరు రాణి(35)కి మరిదితో గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె మరిది ఐరన్ రాడ్డుతో వదినపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu హత్యకు గురైన ఎస్తేరు రాణి
murder


Also Read: కొడుక్కి కరెంట్ షాకిచ్చిన తండ్రి.. అయినా వదలకుండా.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.