యాప్నగరం

నెల్లూరులో జంట హత్యల కలకలం.. అనుమానంతో భర్త ఘాతుకం!

అనుమానం రెండు ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భార్య సహా మరొకరిని కిరాతకంగా చంపేశాడు కసాయి భర్త. జంట హత్యలు నెల్లూరులో సంచలనంగా మారాయి.

Samayam Telugu 11 Oct 2020, 2:43 pm
నెల్లూరు జిల్లాలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త ఘాతుకానికి తెగబడినట్టు తెలుస్తోంది. కట్టుకున్న భార్యని కిరాతకంగా నరికి చంపేశాడు. ఆమె వివాహేతర సంబంధానికి సహకరిస్తోందన్న కోపంతో మరో మహిళను కూడా దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా అలజడి రేపింది. నెల్లూరు రూరల్ పరిధిలోని నాలుగో మైలులో ఈ ఘటన జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
nellore murders


నాలుగో మైలుకి చెందిన నాగేశ్వరరావు కొద్దికాలంగా భార్య నిర్మలమ్మపై అనుమానం పెంచుకున్నాడు. రాత్రి వేళ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆమెకు సహకరిస్తోందని భావించి అదే ప్రాంతానికి చెందిన రమణమ్మ అనే మరో మహిళను కూడా నరికి చంపేశాడు. ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి హత్య.. అందుకే చంపేశారా.?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.