యాప్నగరం

భార్యను చంపి భర్త ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు

జాలరిగా పనిచేస్తున్న సుబ్రమణి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. సోమవారం ఆస్పత్రికి వెళ్లొచ్చాక దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో అతడు భార్యను చంపేసిన ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 3 Jun 2020, 1:41 pm
కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పుదుచ్చేరిలో జరిగింది. పుదుచ్చేరి ముత్యాలపేటనగర్‌‌కు చెందిన సుబ్రమణి(41) జాలరి. అతడికి భార్య మేనక(36), ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న సుబ్రమణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజులుగా భార్యతో తరుచూ గొడవపడుతూ చికాకు పెడుతున్నాడు. సోమవారం కూడా ఉదయం భార్యభర్తలు ఆస్పత్రికి వెళ్లొచ్చాక గొడవ పడ్డారు. తర్వాత మేడపైన గదికి వెళ్లిన సుబ్రమణి మధ్యాహ్నం వేళ నిద్రపోతున్న మేనక తలపై గ్యాస్ సిలిండర్‌తో కొట్టి చంపేశాడు.
Samayam Telugu మేనక, సుబ్రమణి దంపతులు(ఫైల్ ఫోటో)
puducherry tragedy


Also Read: కీచక పోలీస్.. అర్ధరాత్రి ఒంటరి మహిళపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం

ఈ ఘటన కళ్లారా చూసిన ఇద్దరు పిల్లలు ఏడవడంతో వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. చిన్నారులు కేకలు విని చుట్టుపక్కల వారు ముత్యాలపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి లోపలికి వెళ్లి చూడగా మేనక విగతజీవిగా పడి ఉంది. వేరే గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సుబ్రమణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుబ్రమణి మానసిక ఒత్తిడితోనే భార్యను చంపాడా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

Also Read: పుల్లల కోసం వెళ్లిన పదేళ్ల బాలికపై రేప్.. ప్రకాశం జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.