యాప్నగరం

భార్యకు అఫైర్ ఉందని అనుమానం.. ఆమెను చంపి భర్త ఆత్మహత్య

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త నిద్రపోతున్న ఆమె తలపై కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 19 Aug 2020, 11:57 am
కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వ్యక్తి భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో వెలుగుచూసింది. సండూరు తాలూకాలోని తోరణగల్లు పట్టణం బాబానగర్‌లో షేక్‌ హిమామ్‌(44), జమీనా బేగం(38) దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరు చుట్టుపక్కల గ్రామాల్లో కూలిపనులు పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న షేక్‌హిమామ్‌ ఆమెతో నిత్యం గొడవపడేవాడు. ఆమె ఎవరితో మాట్లాడినా అక్రమ సంబంధాలు అంటగట్టి వేధించేవాడు.
Samayam Telugu Image


Also Read: హైదరాబాద్: కూతురిపైనే కామం.. ఆమె న్యూడ్ ఫోటోలు దాచుకుని పాడుపని

ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం జమీనా బేగం ఇంట్లో నిద్రపోతుండగా కర్రతో తలపై బాదాడు. ఆమె కేకలు విన్న స్థానికులు జమీనాను సమీపంలోని జిందాల్ సంజీవని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో విమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. భార్య చనిపోయిందన్న సమాచారం తెలుసుకున్న షేక్‌ హిమామ్‌ భయంతో ఇంటిలోనే పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదుతో తోరణగల్లు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: డబ్బున్న అమ్మాయిలే అతడి టార్గెట్.. పెళ్లి పేరుతో అంతా దోచుకుని మాయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.