యాప్నగరం

భార్యని కొట్టి చంపిన కసాయి భర్త.. కర్నూలులో దారుణం

కుటుంబ కలహాలు ఓ వివాహిత ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్యపై కోపంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. అమానుషంగా అంతమొందించి పరారయ్యాడు.

Samayam Telugu 25 Sep 2020, 3:31 pm
కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చాడో కసాయి భర్త. జిల్లాలోని దేవనకొండ మండలం తేర్నేకల్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మాదన్న, లలిత భార్యాభర్తలు. కలహాల కాపురం కారణంగా కొద్దికాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుతున్నాయి. శుక్రవారం మరోమారు గొడవ జరగడంతో క్షణికావేశంలో భర్త అమానుషానికి పాల్పడ్డాడు. రోకలిబండతో కొట్టి అమానుషంగా చంపేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


రోకలిబండతో బలంగా కొట్టడంతో భార్య లలిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న భర్త మాదన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:
పనిమనిషిపై కన్నేసిన యజమాని.. ఆ వేధింపులు భరించలేక.. తెలంగాణలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.