యాప్నగరం

ప్రియుడితో భార్య శృంగారలీలలు.. భర్తకి తెలిసిపోవడంతో..

రెడ్‌హిల్స్ ఏరియాలో నివాసం ఉంటున్న అంజమ్మాళ్ అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేది.

Samayam Telugu 17 Jun 2020, 5:34 pm
పడక సుఖం కోసం పాకులాడిన మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నై రెడ్‌హిల్స్ ఏరియా అట్టన్‌తంగల్ గ్రామానికి చెందిన తులసీరామన్, అంజమ్మాళ్‌(28) భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. భర్త ట్రక్ లోడ్‌మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. సాఫీగా సాగుతున్న కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
extramarital affair


కొద్దికాలంగా భార్య అంజమ్మాళ్‌ అదే ప్రాంతానికి చెందిన మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదే విషయమై మరోమారు భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది.

Also Read: ప్రియుడితో కలసి నవవధువు ఆత్మహత్య.! వికారాబాద్‌లో కలకలం

చినికిచినికి గొడవ పెద్దదవడంతో కోపంతో రగిలిపోయిన తులసీరామన్ భార్యని దారుణంగా హత్య చేశాడు. సుత్తితో తలపై కొట్టి కిరాతకంగా చంపేశాడు. పిల్లలు చూస్తుండగానే భార్యని దారుణంగా చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న షోలవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: అంతుచిక్కని జంట మరణాలు.. కువైట్ వెళ్తున్నామని చెప్పి కాటికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.