యాప్నగరం

భార్య గొంతు కోసి చంపేసిన భర్త.. చిత్తూరులో దారుణం

కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భర్త కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు.

Samayam Telugu 26 May 2020, 7:39 am
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఐరాల మండలంలోని నాగంవాండ్లపల్లె పంచాయతీ వీఎస్‌ అగ్రహారంలో సోమవారం రాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. ఎస్ఐ శ్రీకాంత్‌ రెడ్డి కథనం మేరకు.. ఐరాల పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన జగదీశ్వర్‌రెడ్డికి తమిళనాడులోని ఉల్లిపుదూరు గ్రామానికి చెందిన సుస్మిత(30)తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుత ఈ దంపతులు వీఎస్‌ అగ్రహారంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu Image


Also Read: అక్రమ సంపాదన కోసం మద్యం అమ్మకాలు.. గుంటూరులో డాక్టర్ అరెస్ట్

ఈ క్రమంలో సోమవారం రాత్రి దంపతులు మరోసారి గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో ఆవేశానికి గురైన జగదీశ్వర్‌రెడ్డి వంట గదిలోని కత్తితో భార్య సుస్మిత గొంతు కోసి పరారయ్యాడు. సుస్మిత కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొనే లోపే ఆమె మృతి చెందింది. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో వారి ఇద్దరు పిల్లలు తల్లిలేని వారయ్యారు.

Also Read: మహిళలపై ప్రేమ వల.. ఆపై కోరికలు తీర్చుకుని బ్లాక్‌మెయిల్.. నెల్లూరు కీచకుడి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.