యాప్నగరం

భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. గుంటూరులో దారుణం

పెళ్లైనప్పటి నుంచే భార్యపై అనుమానపడేవాడు. అదే విషయమై తరచూ గొడవలు జరిగేవి. చివరికి భార్య ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఇరవై ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి.

Samayam Telugu 29 Oct 2020, 1:15 pm
గుంటూరులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. రాత్రివేళ గొంతునులిమి అమానుషంగా అంతమొందించాడు. సత్తెనపల్లి మండలం కట్టావారిపాలెంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన గాయత్రి(20)ని కట్టావారిపాలేనికి చెందిన ఫిలిప్‌కిచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి ఫిలిప్ భార్యను అనుమానిస్తూ తరచూ గొడవడేవాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అదే చివరికి ఆమె పాలిట శాపంగా మారింది. భార్యపై అనుమానంతో ఫిలిప్ ఘాతుకానికి తెగబడ్డాడు. ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరగడంతో కోపంతో ఊగిపోయిన భర్త అమానుషంగా భార్య గొంతునులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భార్య మృతదేహాన్ని పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి సువార్తమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఫిలిప్, అత్త తిరుపతమ్మపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: తల్లి ప్రియుడితో కూతురి పెళ్లి.. చివరికి.. హైదరాబాద్‌లో దారుణ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.