యాప్నగరం

పెళ్లైన 35 ఏళ్ల తర్వాత అనుమానమట! కడపలో భర్త దారుణం

పెళ్లై 35 ఏళ్లవుతోంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ తరువాత నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పదేళ్లుగా అది పెరుగుతూ వచ్చి చివరికి భర్తని కసాయిని చేసింది.

Samayam Telugu 6 Nov 2020, 2:20 pm
కడప జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లైన 35 ఏళ్ల తర్వాత భార్యపై అనుమానంతో కిరాతకంగా హత్య చేసిన ఘటన షాక్‌కి గురిచేసింది. తల్లి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు పోలీసులని ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కాశినాయన మండలం చిన్నాయపల్లెకి చెందిన పుల్లారెడ్డికి బి.మఠం మండలానికి చెందిన నారాయణమ్మతో 35 ఏళ్ల కిందట 1985లో వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


ఇరవై ఏళ్లు సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. భర్త మనసులో భార్యపై అనుమాన బీజం పడింది. పదేళ్లుగా అది పెరుగుతూ వచ్చింది. అదే విషయమై పుల్లారెడ్డి తరచూ భార్యతో గొడవపడేవాడు. అనుమానం పెరిగి అమానుషానికి దారితీసింది. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమె గొంతుకోసి చంపేసి గోనెసంచిలో చుట్టి తెలుగు గంగ కాల్వలో పడేశాడు.

Also Read: పారిపోయి వచ్చిన ప్రేమజంటకి స్నేహితుడి ఆశ్రయం.. చివరికి.!

తల్లి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు వీరమోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో దారుణం బయటపడింది. అయితే భార్యను హత్య చేసిన అనంతరం పుల్లారెడ్డి స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. కాల్వలో శవం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నారాయణమ్మ మృతదేహం అప్పటికే పాడైపోయింది. కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: మంటల్లో కాలిపోయిన అక్క.. చెల్లిని పట్టించిన పోస్టుమార్టం రిపోర్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.