యాప్నగరం

భార్యతో బయటికెళ్లిన తమ్ముడు.. ఆగ్రహంతో అన్న దారుణం.. కత్తితో పొడిచి..

తమ్ముడి భార్య చెంప చెల్లుమనిపించాడు. ఆగ్రహంతో ఉన్న అన్నని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దారుణంగా పొడిచి చంపేశాడు. లాక్‌డౌన్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.

Samayam Telugu 28 Mar 2020, 3:54 pm
కరోనా లాక్‌డౌన్ ఉందని.. బయటకు వెళ్లొద్దని చెప్పినా వినలేదన్న కోపంతో ఓ అన్న ఘాతుకానికి పాల్పడ్డాడు. సొంత తమ్ముడినే దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈస్ట్ ముంబైలోని కండివ్లీ ప్రాంతానికి చెందిన దుర్గషే ఠాకూర్, రాజేష్ ఠాకూర్ అన్నదమ్ములు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లోకి అవసరమైన సరుకులు కొనుక్కొచ్చేందుకు తన భార్యతో కలసి బయటకు వెళ్తున్నట్లు తమ్ముడు రాజేష్ అన్నికి చెప్పాడు.
Samayam Telugu murder


అందుకు దుర్గేష్ నిరాకరించాడు. లాక్‌డౌన్ అమల్లో ఉందని.. బయటకు వెళ్లొద్దని సూచించాడు. అయినా ఇప్పుడు అంత అవసరం ఏముందని ప్రశ్నించాడు. అన్న ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలంటూ తమ్ముడు, అతని భార్య బజారుకి వెళ్లారు. బయటకి వెళ్లొద్దని చెబుతున్నా వెళ్లడం అన్న దుర్గేష్‌కి ఆగ్రహం తెప్పించింది. సరుకులు కొనుగోలు చేసుకుని కొద్దిసేపటికి తిరిగొచ్చిన రాజేష్, అతని భార్యతో గొడవకు దిగాడు.

Also Read: ఐసోలేషన్‌కి గుంటూరు ఎమ్మెల్యే.. మరో 15 మంది..

మాటామాటాపెరిగి వివాదం పెద్దది కావడంతో దుర్గేష్ కోపంతో తమ్ముడు రాజేష్ భార్య చెంపపై కొట్టాడు.అడ్డుకోబోయిన రాజేష్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకుని పొడిచేయడంతో రాజేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం అతనిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని నిందితుడు దుర్గేష్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: కరోనా సోకిందంటూ రైల్లో నుంచి తోసేసి దారుణం.. శ్రీకాకుళంలో ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.