యాప్నగరం

ప్రియుడిని కొట్టిచంపిన యువతి కుటుంబం.. మెదక్‌ జిల్లాలో దారుణం

తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న కక్షతో యువతి కుటుంబం యువకుడిని దారుణంగా కొట్టి చంపేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగింది.

Samayam Telugu 20 May 2020, 2:52 pm
ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో వెలుగుచూసింది. తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న కక్షతో ఓ కుటుంబం యువకుడిని దారుణంగా నరికి చంపేసింది. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నరసింహులు గౌడ్‌ తమ కూతురిని వేధిస్తున్నాడంటూ ఓ కుటుంబం ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి యువతి వెంట పడితే కేసు పెడతామని హెచ్చరించి విడిచిపెట్టారు.
Samayam Telugu Image


Also Read: ఆంటీతో యువకుడి అఫైర్.. ఆమె భర్త, మరిది చేతిలో దారుణంగా

అయితే బుధవారం ఉదయం నరసింహులు గౌడ్‌‌ గేదెలను మేపుకుంటూ వెళ్తుండగా గ్రామ శివారులో కొంతమంది అడ్డగించి తీవ్రంగా కొట్టారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. యువతి కుటుంబసభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కొడుకు ఆ యువతిని వేధించలేదని, ఆమే నరసింహులును ప్రేమిస్తున్నానంటూ వెంటపడిందని ఆమె తెలిపింది.

Also Read: కామంతో చెలరేగిపోయి.. పెదనాన్న కూతురిపైనే అత్యాచారం

తమ కొడుకుతో యువతి ప్రేమ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబసభ్యులు కక్షతో పోలీసులకు ఫిర్యాదు చేశారని నరసింహులు తల్లి ఆరోపించింది. మంగళవారం యువతి కుటుంబసభ్యులు పెళ్లికి రాయబారం పంపితే తాము తిరస్కరించామని, ఆ పగతోనే తన కొడుకును దారుణంగా చంపేశారని ఆమె ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘నాన్నను చంపింది అమ్మ, అంకులే’.. 12ఏళ్ల బాలుడి సాక్ష్యంతో వీడిన మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.