యాప్నగరం

సొంత పిన్నినే తీసుకుపోయి వేరేచోట కాపురం.. బాబాయ్ చేతిలో దారుణహత్య

పిన్నిపైనే ప్రేమ పెంచుకుని ఆమెకు మాయమాటలతో మభ్యపెట్టిన జితు ముండా అనే యువకుడు పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన అతడి బాబాయి బాణంతో చంపేశాడు.

Samayam Telugu 7 Jun 2020, 3:55 pm
వావి వరుసలు మరిచి పిన్నితో ప్రేమలో పడిన ఓ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన బాబాయి ఆ యువకుడిని బాణంతో దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. కేంఝర్‌ జిల్లా వెల్‌కోయి సీఎస్ లక్ష్మీనారాయణపూర్‌ గ్రామానికి చెందిన శంకరముండ భార్య గురుబారితో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే శంకరముండ అన్నయ్య కొడుకు జితు ముండా తరుచూ వారి ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే పిన్ని వరుసయ్యే ఆమెపై మనసు పారేసుకున్నాడు. బాబాయి లేని సమయంలో ఆమెతో రాసలీలలు కొనసాగించేవాడు.
Samayam Telugu Image


Also Read: కూతురి రెండో పెళ్లికి అడ్డొస్తాడని అల్లుడి దారుణ హత్య.. చీరాలలో దారుణం

ఏడాదిగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా.. 15రోజుల క్రితం ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శంకర ముండా జితుపై కక్ష పెంచుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న జితు పిన్నితో కలిసి అదే గ్రామంలో కాపురం పెట్టాడు. శనివారం ట్రాక్టర్‌ దిగి ఇంటికి వెళ్తున్న జితుపై శంకర్ దూరం నుంచి బాణం వేశాడు. అది నేరుగా జితు గుండెల్లో దిగడంతో అక్కడిక్కడే ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత నిందితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

Also Read: ప్రియురాలి ఇంట్లోనే యువకుడి దారుణహత్య.. గదిలో ఏకాంతంగా ఉండగా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.