యాప్నగరం

మిస్ట్‌కాల్ పరిచయం.. వివాహితతో అఫైర్.. చివరికి ఆమె భర్త చేతిలోనే

మిస్ట్‌కాల్ ద్వారా పరిచయమైన వివాహితతో చంద్రశేఖర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియుడితో ఆమె రెండుసార్లు వెళ్లిపోయింది. దీంతో కక్షగట్టిన ఆమె భర్త చంద్రశేఖర్‌‌ను కొట్టి చంపేశాడు.

Samayam Telugu 5 Jun 2020, 10:41 am
మిస్ట్‌కాల్ ద్వారా పరిచయమైన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరు రూరల్‌ ఏరియా మాదావరకు చెందిన చంద్రశేఖర్(20) అనే యువకుడికి కొంతకాలం క్రితం ఓ మహిళ మిస్ట్‌కాల్ ద్వారా పరిచయమైంది. ఇద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న ఆ జంట ఇళ్ల నుంచి పారిపోయి ఓ చోట కాపురం పెట్టారు.
Samayam Telugu Image
Murder in Bengaluru


Also Read: ప్రియుడితో పెళ్లి ఫోటోలు వైరల్.... కాబోయే భర్తకు తెలిసిపోయిందని యువతి ఆత్మహత్య

తన భార్య సడెన్‌గా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భర్త అనేక ప్రాంతాల్లో గాలించాడు. చివరికి చంద్రశేఖర్‌తో ఆమె కలిసి ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆమె బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా ఆమె ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇటీవల మరోసారి ఆమె ప్రియుడితో వెళ్లిపోవడంతో ఆ భర్త తట్టుకోలేకపోయాడు.

Also Read: పనికోసం వచ్చిన బాలికపై కామం.. వ్యభిచారంలోకి దించి... ఆపై గ్యాంగ్ రేప్

తన సంసారాన్ని నాశనం చేస్తున్న చంద్రశేఖర్‌ను చంపేయాలనుకున్నాడు. కొద్దిరోజుల క్రితం మహిళ భర్త, బంధువులు కలిసి అతడిని తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో వెళ్లిబోయిన భార్య.. పోలీసులకు భర్త ఫిర్యాదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.