యాప్నగరం

మద్యానికి డబ్బుల కోసం వేధించిన భర్త.. తెల్లారేసరికి శవమై

మద్యానికి బానిసైన బనమాలి డబ్బుల కోసం భార్య సునీతను తీవ్రంగా వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రమాదవశాత్తూ అతడు చనిపోయాడు.

Samayam Telugu 17 May 2020, 11:47 am
మద్యానికి బానిసై డబ్బలు కోసం వేధిస్తున్న వ్యక్తి భార్య చేతిలో ప్రమాదవశాత్తూ హత్యకు గురైన ఘటన ఒడిశాలోని బ్రహ్మపురం నగరంలో చోటుచేసుకుంది. బ్రహ్మపుర బజారు జగిలి వీధిలో బనమాలి బెహర(37), సునీతా బెహర దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. భార్యాభర్తలిద్దరూ వీధుల్లో తిరుగుతూ పాలీథిన్లు ఏరుకుని పొట్టపోసుకుంటున్నారు. పేదరికానికి తోడు మద్యానికి బానిసైన బనమాలి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు.
Samayam Telugu Image


Also Read: కీచక లెక్చరర్.. ప్రేమించడం లేదని యువతి ఫోటోలు న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి

మద్యానికి డబ్బు కోసం భార్యను తరుచూ వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా బనమాలి భార్యతో ఘర్షణ పడి ఆమెపై రుబ్బురోలు పొత్రంతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. సునీత భర్తను అడ్డుకుని కిందకు నెట్టే క్రమంతో రుబ్బురోలు పొత్రం అతడి తలపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం తోపులాటలో పొత్రం బనమాలి తలకు బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Also Read: ఉమ్మేసి దొరికేశాడు.. పోలీసుల అదుపులో మోస్ట్‌వాంటెడ్ కిల్లర్

దీంతో షాకైన సునీత భర్తను చికిత్స కోసం ఎమ్కేసీజీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన భర్త ప్రమాదంలో చనిపోయాడని సునీత అందరినీ నమ్మించింది. అయితే బనమాలి శరీరంపై గాయాలు వేరే విధంగా ఉండటంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సునీతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నేరం అంగీకరించింది. దీంతో ఆమెపై హత్య కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేశారు. తండ్రి మరణం, తల్లి జైలుకెళ్లడంతో వారి ఐదుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు.

Also Read: అఫైర్ బయటపడిందని జంట ఆత్మహత్య.. కామారెడ్డి జిల్లాలో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.