యాప్నగరం

భార్యకి చీరకొంగు బిగించి హత్య.. హైదరాబాద్‌లో భర్త ఘాతుకం

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. చిన్నచిన్న విషయాలకే అసహనంతో రగిలిపోతూ సొంతవాళ్లపైనే దారుణాలకు పాల్పడుతున్నారు. భోజనం వండలేదని భార్యను చంపేసిన భర్త కిరాతకం వెలుగుచూసింది.

Samayam Telugu 5 Dec 2020, 2:55 pm
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భోజనం వండలేదన్న కోపంతో భార్యను అమానుషంగా అంతమొందించాడో కసాయి భర్త. ఈ దారుణ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీర్‌పేట ఏరియాలని ప్రశాంతి నగర్‌లో శ్రీనివాసరెడ్డి, తన భార్య జయమ్మ(40), కొడుకుతో కలసి నివాసముంటున్నాడు. భార్య జయమ్మ కొడుకుతో కలసి వివాహానికి వెళ్లి వచ్చిన సమయంలో ఇంటికొచ్చిన భర్త శ్రీనివాసరెడ్డి భోజనం వండమని చెప్పాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. చీరతో భార్య గొంతుబిగించి అమానుషంగా చంపేశాడు. భార్య ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: రాత్రి మందుపార్టీ.. తెల్లారేసరికి శవమైన యువతి.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.