యాప్నగరం

జగిత్యాలలో కాల్పుల కలకలం.. భార్యను తుపాకీతో కాల్చి..

తరచూ గొడవలు జరుగుతుండడంతో భర్త నుంచి దూరంగా వచ్చేసి భార్య పుట్టింటికి చేరింది. ఆగ్రహించిన భర్త.. తుపాకీతో కాల్చి చంపేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది.

Samayam Telugu 4 Feb 2020, 3:55 pm
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన జగిత్యాలలో కలకలం రేపింది. ఆ ఘటనలో భార్య బంధువుకు తీవ్రగాయాలయ్యాయి. రెండు బుల్లెట్లు శరీరంలో నుంచి దూసుకెళ్లాయి. ఆయనను హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu gun fire


జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజుపల్లికి చెందిన గీతికకు మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో కొద్దికాలం కిందట వివాహమైంది. కొద్దిరోజులు సాఫీగా సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విసుగుచెందిన గీతికి పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read: ప్రేమ నగరంలో సెక్స్ దందా.. రష్యా నుంచి అందమైన యువతులను తెచ్చి..

ఈ నేపథ్యంలో శ్రీనివాస్ నిన్న అర్ధరాత్రి సమయంలో ఇస్రాజుపల్లి వెళ్లి భార్య గీతికతో గొడవకు దిగాడు. వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ తుపాకీతో గీతికపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గీతిక మేనమామ రాజిరెడ్డి అడ్డుపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఒక బుల్లెట్ రాజిరెడ్డి కడుపులో నుంచి.. మరోటి చేతిలో నుంచి దూసుకెళ్లాయి.

Read Also: చెల్లెలిపై అన్న అత్యాచారం.. గుంటూరు జిల్లాలో దారుణం

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాజిరెడ్డిని హుటాహుటిన జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంగనర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనపై డీఎస్పీ వెంకటరమణ విచారణ చేపట్టారు. సంఘటన పై ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్‌ మాజీ మావోయిస్టుగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.