యాప్నగరం

మహిళ ఒంటిపై సలసల కాగుతున్న నీళ్లు పోసి.. ప్రియుడి పైశాచికం

సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 2 Feb 2020, 4:14 pm
సహజీవనం.. ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. నమ్ముకుని వచ్చిన వాడే అనుమానంతో అమానుషంగా ప్రవర్తించాడు. అక్రమ సంబంధం అంటగట్టి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక ఎదురుతిరగడంతో దారుణానికి ఒడిగట్టాడు. మసలిపోతున్న నీళ్లను ప్రేయసిపై పోసేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu boiling water


మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ పరిధి కెడియా గ్రామానికి చెందిన సూరజ్ ప్రభుదయాల్ యాదవ్ భవన నిర్మాణ కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన యువతి కూడా అవే పనులు చేసేది. అలా క్రమంగా దగ్గరైన ఇద్దరూ కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. నాగ్‌పూర్‌‌కి వలస వచ్చి మంకాపూర్ ఏరియాలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

Also Read: లేడీస్ టాయిలెట్‌లో డీల్.. దొరికిపోయిన హౌస్‌కీపింగ్ లేడీ..

కొద్దికాలంగా ప్రియురాలి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సూరజ్.. తరచూ ఆమెతో గొడవపడుతున్నాడు. అక్రమ సంబంధం అంటగట్టి ఇబ్బందులకు గురిచేస్తుండడంతో వివాదాలు జరుగుతున్నాయి. ఓ రోజు ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సూరజ్.. పొయ్యిపై సలసల కాగుతున్న నీళ్లను ప్రేయసిపై పోశాడు. దీంతో ఆమె ఒళ్లంతా కాలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: యువతి బట్టలిప్పేసి.. ప్రైవేట్ పార్ట్స్‌లో కారంకొట్టి.. వీడియో షూట్ చేస్తూ ఆడాళ్ల శాడిజం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.