యాప్నగరం

భార్యాభర్తల గొడవలో దూరి.. హంతకుడిగా మారిన ఆటోడ్రైవర్.. కర్నూల్‌లో షాకింగ్

భార్యాభర్తల మధ్య తీవ్రవాగ్వాదం జరుగుతోంది. అది చూస్తూ ఉన్న ఆటోడ్రైవర్ ఇద్దరినీ వారించేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భర్త ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 29 Sep 2020, 1:35 pm
గొడవపడుతున్న భార్యాభర్తలను విడదీసేందుకు వెళ్లిన ఆటోడ్రైవర్ చిక్కుల్లో పడ్డాడు. వారిని విడదీసేందుకు ప్రయత్నించి బలంగా నెట్టేయడంతో భర్త కిందపడి మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగింది. నంద్యాల రూరల్ మండల పరిధిలోని నందమూరి నగర్‌కి చెందిన ఓబులేసు(50), రమాదేవి భార్యాభర్తలు. వారికి ఒక కొడుకు, కూతురు సంతానం. ఏదో విషయమై భార్యాభర్తల నడుమ వివాదం రేగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అది చినికిచినికి గాలివానగా మారి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవను చూసి అదే వీధికి చెందిన ఆటో డ్రైవర్ బాషా స్పందించాడు. గొడవపడుతున్న ఆలుమగలను విడదీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో భర్త ఓబులేసును బలంగా నెట్టేశాడు. ఒక్క ఉదుటున కిందపడిపోయిన ఓబులేసు తల పగిలిపోయింది. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read: కనిపించకుండా పోయిన అక్క.. గుట్టల్లో శవమై.. షాద్‌నగర్‌లో దారుణం

ఓబులేసు చనిపోయాడని గ్రహించిన బాషా వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తగాదా పడుతున్న భార్యాభర్తలను విడదీయబోయి బాషా నేరస్తుడిగా మారాడు.

Read Also: బంధువులని బెడ్రూమ్ ఇస్తే నీచం.. గుంటూరులో షాకింగ్ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.