యాప్నగరం

దత్తత తీసుకున్న బాలికపై బంధువుతో కలిసి అత్యాచారం

పిల్లలు లేకపోవడంతో ఓ బాలికను దత్తత తీసుకున్న మహేంద్రన్ బంధువుతో కలిసి ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Samayam Telugu 3 Sep 2020, 10:03 am
పిల్లలు లేకపోవడంతో ఓ బాలికను దత్తత తీసుకున్న వ్యక్తి బంధువుతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. విరుదునగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన మహేంద్రన్‌ (45) పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. సంతానం లేకపోవడంతో బంధువుల బాలిక(12)ను దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో బంధువులు ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Image


Also Read: ఇష్టం లేని భార్యతో ఉండలేక.. ప్రియురాలితో కలిసి యువకుడి ఆత్మహత్య

ఆమెను పరీక్షించిన డాక్టర్లు చిన్నారిపై అనేకసార్లు అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందిన బాలిక తల్లిదండ్రులు విరుదనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పెంపుడు తండ్రి మహేంద్రన్‌, అతడి అన్న కుమారుడు కామరాజ్‌ పెరుమాళ్‌ (25) బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు.. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: కృష్ణా జిల్లా: దళిత యువతితో ప్రేమాయణం.. కేసు పెట్టిందన్న కక్షతో ఇంటికి నిప్పు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.