యాప్నగరం

పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు.. సిరిసిల్లలో విషాదం

బట్టల షాపు యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటల్లో కాలిపోయాడు. సిరిసిల్లలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 24 Oct 2020, 1:49 pm
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బట్టల షాపు యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణ శివారు బైపాస్ రోడ్డులో జరిగింది. అనంతనగర్‌కి చెందిన గాజుల జనార్ధన్ (32) పట్టణంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇంటి నుంచి బయటికెళ్లిన జనార్ధన్ బైపాస్ రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో ఒళ్లంతా కాలిపోయి మృత్యువాతపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
fire


Also Read: తల్లి తల నరికి తీసుకెళ్లిన కసాయి కొడుకు.. తెలంగాణలో కిరాతకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.