యాప్నగరం

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి హత్య.. అందుకే చంపేశారా.?

పోలీస్ కమిషనర్ కార్యాలయ అటెండర్‌ని తుపాకీతో కాల్చి చంపేశారు దుండగులు. విజయవాడలో ఈ దారుణ ఘటన జరిగింది.

Samayam Telugu 11 Oct 2020, 10:22 am
విజయవాడలో దారుణ హత్య జరిగింది. తుపాకీతో వచ్చిన దుండగులు యువకుడిని కాల్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగర శివారు నున్న బైపాస్ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న మహేష్‌పై గుర్తు తెలియని దుండగులు స్కూటీపై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఛాతీ, మెడలోకి బుల్లెట్లు దూసుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Samayam Telugu హత్యకు గురైన మహేష్
vijayawada murder


అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి హరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇద్దరితో మహేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తుపాకీ కాల్పులతో భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగర్ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పాట్‌కి వచ్చి పరిశీలించారు. మహేష్‌ కదలికలపై రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల కారణంగా హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భార్యని తీసుకెళ్లిపోయిన ప్రియుడు.. పదేళ్ల తర్వాత భర్త కంటపడడంతో.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.