యాప్నగరం

ప్రేయసిపై అనుమానంతో గొంతుకోసిన ప్రియుడు.. చిత్తూరులో ఘోరం

అడవిబుదుగురికి చెందిన ఆనంద్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే ఆమె మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 28 Jul 2020, 6:05 pm
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమె గొంతుకోసేసిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుప్పం మండలం అడవిబుదుగురుకి చెందిన ఆనంద్.. అదే ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. కొద్దికాలంగా ప్రేయసిపై అనుమానం పెంచుకున్న ఆనంద్ తరచూ ఆమెతో గొడవపడుతున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరోమారు గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుందన్న నెపంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. కత్తితో కిరాతకంగా గొంతుకోసేశాడు. ప్రియురాలి కేకలు విన్న స్థానికులు అప్రమత్తమై ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder attempt


Also Read: ముగ్గురం ఎంజాయ్ చేద్దాం.. శోభనం రాత్రి వధువుకి షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.